6 నిమిషాల వ్యవధిలోనే.. రెండు భారీ భూకంపాలు

-

ఇండోనేసియాను రెండు భారీ భూకంపాలు వణికించాయి. సుమత్రా దీవుల్లో 6 నిమిషాల వ్యవధిలోనే 6.8, 6.9 తీవ్రతతో సముద్ర గర్భంలో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
సుమత్రా దీవుల్లో బెంగ్కులు రాష్ట్రానికి 144.5 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది అమెరికా జియోలాజికల్​ సర్వే. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

earthquake

గత మార్చి నెలలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.ఇండోనేసియాలోని బాలీ దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6.3గా తీవ్రత నమోదైనట్లు అమెరికా భౌగోళిక సంస్థ(యూఎస్​జీఎస్​) తెలిపింది. దక్షిణ ఇండోనేసియా దీవుల్లోని బాలీ ప్రాంతంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు భూమి కంపించింది.నుసా దువా పట్టణానికి దక్షిణాన సుమారు 255 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version