నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్

-

నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్​పుర్​లో చోటుచేసుకుంది. అత్యాచారం తర్వాత బాధితురాలిని వదిలిపెట్టగా ఆమె సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగిందంటే.. ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో రైల్వే స్టేషన్​ బయట నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మహారాజ్​గంజ్​ జిల్లాకు చెందిన 25 ఏళ్ల వివాహిత భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసింది. అనంతరం గోరఖ్​పుర్​కు చేరుకున్న మహిళ.. రైల్వేస్టేషన్​ బయట పడుకుంది. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో రైల్వే స్టేషన్​కు వచ్చిన ముగ్గురు దుండగులు ఆమెను వేధించారు.

అనంతరం ఒంటరిగా ఉన్న ఆమెను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని వదిలిపెట్టగా.. సమీపంలోని జీఆర్పీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version