రాజేంద్ర నగర్‌ లో రెచ్చిపోయిన మహిళా ప్రయాణికురాలు…!

-

రాజేంద్ర నగర్‌ లో మహిళా ప్రయాణికురాలు రెచ్చిపోయింది. ఇక అసలు ఏమైందనేది చూస్తే.. బస్సు కండక్టర్ పై చెప్పు తీసుకొని చంపలు వాయించింది ఈ మహిళ. ఇక కారణం ఏమిటో చూస్తే.. ఆమె అడిగిన చోట బస్సు ఆపలేదు అని ఆరోపిస్తూ కండక్టర్‌ ని విచక్షణారహితంగా దుర్భాషలాడుతూ ఆమె చెప్పు తో కొట్టింది.

మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సు లో ఇది చోటు చేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన మహిళ శివ రాంపల్లికి చెందిన ప్రసన్న అని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news