పచ్చని కాపురంలో బిర్యానీ చిచ్చు..! బిర్యానీ కోసం మహిళ ఆత్మహత్య..!

-

women suicide because of biryani in tamilnadu
women suicide because of biryani in tamilnadu

కొన్నిసార్లు కొన్ని కథలు వింటుంటే ఆశ్చర్యం తప్పదు..! ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. ఈ కథ వింటే మీకు కూడా అలానే అనిపిస్తుంది. అదో సజావుగా సాగే కుటుంబం కానీ వారి మధ్య బిర్యానీ చిచ్చు పెట్టింది. చివరికి అదే బిర్యానీ వారి కుటుంబంలో ఒకరిని పొట్టనబెట్టుకుంది. అవునండీ బిర్యానీ ఇప్పించలేదని ఓ భార్య భర్త పై అలిగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు 11 ఏళ్ళు కూతురు 9 ఏళ్ళు. వీరు హాయిగా తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే వీరి జీవితంలో బిర్యానీ చిచ్చు పెట్టింది. గురువారం ఉదయం శరణ్య తనకి బిర్యానీ తినాలని కోరికగా ఉందని భర్త మనోహర ను బిర్యానీ తేవాల్సిందిగా కోరింది. తన వద్ద ప్రస్తుతం సరిపడా డబ్బు లేదని తరువాత ఎప్పుడైనా తెచ్చుకుందామని మనోహర అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శరణ్య మనోహరన్ పై అలిగింది కొంత సమయం మాట్లాడలేదు పైగా ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. మనోహరన్ పనిమీద ఇనిటీ నుండి బయటకు వెళ్ళాడు అదే సమయంలో శరణ్య భర్త బండి లో నుండి పెట్రోల్ తీసి వంటి పై పోసుకొని నిప్పంటించుకుంది. పొగను గమనించిన స్థానికులు వెంటనే నిప్పును ఆర్పి ఆమెను చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో శరణ్య చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసుకొని భర్త పిల్లలను ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news