వరల్డ్ కప్ లో ఘోర ఓటమి…పాకిస్తాన్ సంచలన నిర్ణయం !

-

ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో కేవలం నాలుగు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు సెమిఫైనల్ కు అర్హత సాధించాయి. అందులో ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లు సెమీస్ కు అర్హత సాధించి తర్వాత మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ సెమీస్ కు చేరుతుంది అనుకున్నా, ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఘోరంగా ఓడిపోయి సెమీస్ కు దూరం అయింది. ఈ ఘోరఓటమి కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు లోకల్ పత్రిక ఒకటి పేర్కొన్నది. విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని తొలగించడానికి చూస్తున్నట్లు NDTV తెలియచేసింది. ఆఖరికి జట్టు డైరెక్టర్ గా ఉన్న మీకీ ఆర్థర్ ను కూడా తొలగించనున్నారట.

ఈ విషయం పై పిసిబి చీఫ్ జకా అష్రాఫ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే నిన్న పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news