తెలంగాణలో జోరుమీదున్న ధాన్యం కొనుగోళ్లు..

-

తెలంగాణ యాసంగి ధాన్యం కొనుగోలు జోరు మీదున్నాయి. మొన్నటి వరకు వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించుకున్నారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్‌ నష్టపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతుల బాధ చూడలేకనే, 3వేల కోట్ల నష్టం వచ్చినా.. ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. అయితే.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 6,832 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాలశాఖ వెల్లడించింది.

 

ఇప్పటి వరకు ధాన్యం దిగుబడికి అనుగుణంగా 30 జిల్లాల్లో 5,299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని పౌరసరఫరాలశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ రోజు వరకు 76,495 మంది రైతుల నుంచి రూ. 1,483 కోట్ల విలువైన 7.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించింది. ఇందులో 7.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించామని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోళ్ల కోసం 8.36 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news