కాపునాడు సమావేశానికి వైసీపీ దూరం

-

విశాఖ కాపునాడు సమావేశం నిర్వహణలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రాధా – రంగా అసోసియేషన్ పేరుతో వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సభను అత్యంత ఘనంగా నిర్వహించ తలపెట్టిన కాపునాడు సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. నేతలు ఎవరు ఈ సమావేశానికి హాజరు కావద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

స్టేజీ మీద వైసిపి నేతలు ఉన్న సమయంలో జనసేన నినాదాలు చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రంగా వర్ధంతి వేల ఆయనని తలచుకోవడానికే అని చెబుతున్నా.. రాజకీయ అంశాలు లేకుండా సభ ఐతే జరగదు వంగవీటి రంగా సాక్షిగా ఈ సభ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version