నందమూరి బాలకృష్ణపై ఈసీకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఈ క్రమంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌పై ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ …బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా బాలయ్య, లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు . అంతేకాదు.. ప్రభుత్వంపై ఎన్ఆర్‌ఐలు దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కాగా, ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘జాబ్‌క్యాలెండర్‌ అని, సీపీఎస్‌ రద్దని, మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేసిన నయ వంచకుడు ముఖ్యమంత్రి జగన్‌ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news