వైసీపీకి నూతన్ నాయుడికి సంబంధం లేదు : పెందుర్తి ఎమ్మెల్యే

-

పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు శిరోముండనం కేసు బాధితుడు శ్రీకాంత్ ను పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి లో దళిత యువకుడి శ్రీకాంత్ పై  జరిగిన శిరోముండన ఘటన బాధాకరమని ఈ ఘటన ను చూస్తే సమాజం ఎటు వైపు పోతుందోనని భయం వేస్తుందని అన్నారు. ఈ సంఘటన కు పాల్పడిన వారిని 24 గంటల్లోగా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారన్న ఆయన జనసేన,టిడిపి నేతలు ఇప్పటి వరకు భాధితుడ్ని ఎందుకు పరామర్శించలేదు? అని ప్రశ్నించారు.

నూతన్ నాయుడు జనసేన కు సన్నిహితంగా ఉన్నారనీ పరన్నజీవి సినిమాకు నూతన నాయుడే నిర్మాతనీ ఆయన పేర్కొన్నారు. ఆయన వైసిపి మనిషి అని అసత్య ప్రచారం చేస్తున్నారన్న అదీప్ రాజ్ వైసీపీకి నూతన నాయుడికి సంబందం లేదని అన్నారు. శ్రీకాంత్ అన్ని విధాలుగా ఆదుకుంటామన్న ఆయన ఇళ్ల పట్టాను, ఉద్యోగంతో పాటు ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం  అందిస్తామనీ అన్నారు. ఈ ఘటనలో నూతన నాయుడు ప్రేమేయం ఉంటే ఆయన మీద కూడా చర్యలు తప్పవనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఈరోజు ఎమ్మెల్యే తన సొంత డబ్బు యాబై వేలు శ్రీకాంత్ కి అందించారు. ఇక ప్రభుత్వం మరో లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా అందించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version