వెంకన్న స్వామిగా దర్శనమిచ్చిన వైసీపీ ఎంపీ..

-

ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుంది. అయితే అది కొన్ని కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంది. అది ఇదే.. వైసీపీ యువ నేత‌, తిరుప‌తి ఎంపీ గురుమూర్తి శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి అవతారం దర్శనమిచ్చారు. శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వేష‌ధార‌ణ‌లో క‌నిపించిన ఆయ‌న అంద‌రి చూపును ఆకర్షించారు. తిరుప‌తిలో జ‌రుగుతున్న‌ తాతయ్య గుంట గంగ‌మ్మ జాత‌ర‌లో ఈ దృశ్యం క‌నిపించింది.

Image

జాత‌ర‌లో భాగంగా ఆదివారం వెంక‌టేశ్వ‌ర స్వామి వేష‌ధార‌ణ‌లో వెళ్లిన గురుమూర్తి గంగ‌మ్మ త‌ల్లికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా గురుమూర్తే ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. తిరుపతి గంగమ్మ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పిన గురుమూర్తి.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా తాతయ్య గుంట గంగమ్మతల్లి జాతర రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.

Image

Read more RELATED
Recommended to you

Latest news