రఘురామను కొట్టారా లేదా…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఆయనపై నిన్న పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనే వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనకు నేడు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిజిహెచ్ లోనే ఎంపి రఘురామకృష్ణరాజుకి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు హైకోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక ఇస్తుంది. మెడికల్ బోర్డులో సభ్యులుగా జిజిహెచ్ సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సూపరింటిండెంట్ సూచించిన మరొక వైద్యుడు ఉంటారు.

జిల్లా సిఐడీ కోర్టు కు నివేదిక అందిస్తారు. ఎంపి ఒంటి గాయాలపై నివేదికలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. జిజిహెచ్ వైద్య పరీక్షల అనంతరం ఎంపిని రమేష్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. జిజిహెచ్ లో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు… ఎవరిని లోపలి అనుమతించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version