వైసీపీ గెలిచే స్థానాలు కేవలం 18 నుంచి 20 స్థానాలే – ఎంపీ రఘురామ

-

శ్రీకాకుళం నుంచి మొదలుకొని అనంతపురం వరకు అధికార వైకాపా గెలిచేది కేవలం 18 నుంచి 20 స్థానాలు మాత్రమేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. పోటాపోటీగా ఉండే 25 స్థానాలలో 15 స్థానాలతో కలుపుకొని వైకాపాకు 35 స్థానాలు దక్కుతాయని గతంలో తాను చెప్పానని, ఇక ఇప్పుడు నెల్లూరుకు చెందిన పెద్ద రెడ్లు, గుంటూరుకు చెందిన మంచి వ్యక్తులు టీడీపీ, జనసేన కూటమి వైపు వస్తే వైకాపాకు మిగిలేది దేవదాసు సినిమాలోని కలయిదని… అనే పాట మాత్రమేనని, ఆ పాటను వైకాపా నాయకులు ప్రాక్టీస్ చేస్తే మంచిదని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కాఫీ వ్యక్తిత్వాన్ని, ఆయన దాన గుణాన్ని, ప్రజల్ని ప్రేమించే విధానాన్ని ఆరు రోజుల్లోనే తెలుసుకొని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు వైకాపాకు గుడ్ బై చెప్పేశారని, మరో వారం, పది రోజుల వ్యవధిలో ఆయన టీడీపీ, జనసేన పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారేమోనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి తనకు ఆరు నెలల సమయం పడితే, అంబటి రాయుడు ఆరు రోజులనే అర్థం చేసుకొని పార్టీని వీడారని, బ్యాటింగ్ చేసి రెండు వందల పరుగులు చేస్తాడునుకున్న రాయుడు, హిట్ వికెట్ అయ్యారని కొంత మంది కామెంట్లు చేయవచ్చునని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news