ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాబోతుంది – విడదల రజినీ

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వర్గం ప‌రిధిలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ నాలుగున్న‌రేళ్ల‌పాటు కొన‌సాగిన జ‌గ‌న‌న్న ప‌రిపాల‌న‌లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వెల్లువ‌లా సంక్షేమ ఫ‌లాలు అందాయ‌ని తెలిపారు. మ‌నం ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌నే తిరిగి మ‌ళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంద‌ని తెలిపారు.

జ‌గ‌న‌న్న పేద‌లంద‌రి గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న బ‌లం ఆయ‌నేన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల చెంత‌కు చేరి మ‌నం చేసిన మంచిని గుర్తు చేస్తే చాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంతా మద్ద‌తుగా నిలుస్తార‌ని వివ‌రించారు. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే ల‌క్ష్యంగా త‌న‌ను జ‌గ‌న‌న్న పంపార‌ని పేర్కొన్నారు. అందుకోసం ఇప్ప‌టికే డివిజ‌న్ల వారీగా సమావేశాలు నిర్వ‌హించుకున్నామ‌న్నారు. పార్టీ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించుకున్నామ‌ని చెప్పారు. పార్టీ సంబంధించిన అన్ని కార్య‌క‌లాపాలు, ఎన్నిక‌ల క‌స‌ర‌త్తును వేగ‌వంతం చేసుకున్నామ‌న్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌హ‌కారంతో మ‌రింత‌గా దూసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news