కేటీఆర్ అన్న.. నాకు న్యాయం చేయండి… మొర పెట్టుకున్న యువతి

-

వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన ఓ యువతి… కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ ను ప్రేమించింది. కొన్ని రోజుల వరకు వాళ్ల ప్రేమ సజావుగానే సాగింది. తనను పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు మాటిచ్చాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఆ యువకుడు.. ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు.

కేటీఆర్ అన్న.. నాకు న్యాయం చేయండి. మీరే నాకు న్యాయం చేయగలరు. నేను మోసపోయారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నా వెంట పడి ప్రేమించి.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడంటూ ఓ యువతి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మొర పెట్టుకుంది. టీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి కేటీఆర్ అన్నే తనకు న్యాయం చేయాలంటూ కోరింది.

వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన ఓ యువతి… కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ ను ప్రేమించింది. కొన్ని రోజుల వరకు వాళ్ల ప్రేమ సజావుగానే సాగింది. తనను పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు మాటిచ్చాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఆ యువకుడు.. ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఆ యువకుడిపై కేసు పెట్టింది. దీంతో 20 రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువకుడు పోలీస్ స్టేషన్ లో యువతికి మాటిచ్చాడు. 20 రోజులు గడిచి ఏడాది అయినా ఇప్పటికీ తనను పెళ్లి చేసుకోవడం లేదని ఆ యువతి బోరున విలపించింది. నాకు మీరే న్యాయం చేయాలి.. అంటూ టీఆర్ఎస్ భవన్ వద్ద వేడుకోవడంతో… స్పందించిన కేటీఆర్.. ఆ యువతి సమస్యను వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ మహిళా విభాగానికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version