మద్యం మత్తులో యువతుల బీభత్సం..బైకులను ఢీకొట్టి!

-

మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ ఇద్దరు యువతులు బీభత్సం సృష్టించారు. మత్తులో డ్రైవ్ చేసిన యువతి ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ – KPHB మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. యాక్సిడెంట్ అనంతరం సదరు యువతులు ద్విచక్ర వాహనదారుడిని బెదిరించినట్లు తెలిసింది.

దీంతో సదర బాధితుడు వెంటనే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు.రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు..డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్టు వెల్లడించారు. ఈ మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనతో పెద్దఎత్తున ట్రాఫిక్ జాయిమ్ అయ్యింది.

https://twitter.com/TeluguScribe/status/1897831270111219877

Read more RELATED
Recommended to you

Latest news