సిబిఐ కోర్ట్ లో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి బెయిల్ పిటీషన్..

-

తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్ట్ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రోజు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ ఇవ్వాల్సిందిగా అతను తరపున లాయర్లు పిటీషన్ వేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సిబిఐ కోర్ట్ లో ఈ బెయిల్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ రేపు విచారణకు వస్తుందని తన తరపు లాయర్లు చెప్పారు. ఇక ఈయన వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంగా సిబిఐ అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉంచారు. ఈయన మే 16వ తేదీ నుండి జైల్లోనే ఉన్నారు, కాగా ఇటీవల ఈయన ఆరోగ్యం సరిగా లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

ఈ కారణంగా బెయిల్ ఇవ్వమని కోరనున్నట్లు తెలుస్తోంది. మరి అవినాష్ రెడ్డికి ఇచ్చినట్లుగా.. సిబిఐ కోర్ట్ లో భాస్కర్ రెడ్డికి బెయిల్ దొరుకుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version