మాట ఇస్తే తప్పను: సిఎం జగన్

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ ఎక్కువగా నిరసనలు చేస్తుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని సస్పెండ్ చేసారు. టిడ్కో ఇళ్ళపై చర్చ జరగాలి అని వారు డిమాండ్ చేసారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుంది అని సిఎం జగన్ అన్నారు. మాట ఇస్తే తప్పను అనే క్రెడిబిలిటీ తనకు ఉందని ఆయన అన్నారు.

చంద్రబాబు క్రెడిబిలిటీ ఎలా ఉంటుందో జనాలకు తెలుసు అని ఆయన అన్నారు. రైతులకు తాము ఇచ్చిన మాట మేరకు సహాయం చేసామని సిఎం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు బీమా కట్టాలి అంటేనే భయపడే పరిస్థితి ఉండేది అని సిఎం జగన్ అన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున సభలో నిరసనకు దిగారు. కాగా శాసన సభను పది నిమిషాల పాటు వాయిదా వేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version