ఉచిత బైక్‌లు ఇవ్వ‌బోతున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌..

-

రాష్ట్రంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన జగన్ ఈసారి దివ్యంగుల కోసం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల బైక్‌లను ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

స్వయం ఉపాధి పొందుతున్న వారిని ప్రోత్సహించేందుకు జగన్ ప్రభుత్వం ఇలా ఉచిత మూడు చక్రాల బైక్‌లు ఇవ్వనున్నట్టు తెలిసింది. . అందుకోసం తొలి విడుతలో 2500 మందికి ఇవ్వాలని, దానికి రూ.22 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఎవరైతే ఆ మూడు చక్రాల బండ్ల కోసం దరకాస్తు చేసుకుంటారో వారందరు కూడా వారి సంబంధిత ఫారాలను ఆయా గ్రామ వాలంటీర్లకు అందించాలని ఇప్పటికే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news