సీఎం కేసీఆర్ ను దెయ్యలతో పోల్చిన వైఎస్ షర్మిల

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను వైఎస్‌ షర్మిల ఎప్పుడూ టార్గెట్‌ చేస్తూనే ఉంటుంది. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎత్తి చూపుతూ… సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌ లో ఫైర్‌ అవుతారు వైఎస్‌ షర్మిల. ఇక తాజాగా మరోసారి వైఎస్‌ షర్మిల…. సీఎం కేసీఆర్ ను ఏకంగా.. దెయ్యాలతో పోల్చుతూ ట్వీట్‌ చేశారు.

” దెయ్యాలు వేదాలు వల్లించడం ఎలాగో తెలియాలంటే ఇవ్వాలటి KCR గారి ప్రెస్ మీట్ చూడండి. తనలాంటి దయ్యాల దుమ్ము ఎలా దులపాలో దొరగారు వివరించి చెప్పారు. ” అంటూ నిన్న సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ పై సెటైర్లు పేల్చారు వైఎస్‌ షర్మిల.

ఇక అంతకు ముందు ట్వీట్‌ లో.. “అయ్యా కేసీఆర్ గారు, ఢిల్లీ కోటలు బద్దలు కొట్టుడు కాదు.. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టు. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకో.మోడీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ.. నోటిఫికేషన్లకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో” అంటూ నిప్పులు చెరిగారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version