వైఎస్సార్ బిడ్డలు దొంగలు కాదు, గజ దొంగలు అస్సలే కాదు : విజయమ్మ

-

షర్మిల పార్టీ ప్రకటన నేపథ్యంలో వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డలు దొంగలు కాదు, గజ దొంగలు కాదని వైఎస్ విజయమ్మ వెల్లడించారు. మాట పోతే ప్రాణం పోయినట్లు అనుకుంటారని.. మేము ఎవరిని దోచుకోలేదు, ఏమి దాచుకోలేదని స్పష్టం చేసారు. అన్ని ప్రాంతాలని వైఎస్ సమానంగా చూసారని.. అందుకోసమే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు.

రాజశేఖర్ రెడ్డి రాక ముందు తెలంగాణలో రక్తం మరకలు ఉంటే… వైఎస్ వచ్చాక ఆ భూముల్లో నీళ్లు పారాయన్నారు. తుపాకుల చప్పుళ్ళు దిగాయని.. మీ కుటుంబ సభ్యురాలుగా నా బిడ్డ షర్మిలాను చేర్చుచుకోండని కోరారు. అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని.. తెలుగు రాష్ట్రాలు తమకు ఒక్కటేనని పేర్కొన్నారు. రాష్టాల మధ్య అభిప్రాయ బేధాలు రావొచ్చు.

సమస్యలు ఉంటే.. పరిష్కరించుకోవాలన్నారు. చట్టాలు ఉన్నాయి, బోర్డులు ఉన్నాయని… అన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు దైవ సంకల్పమన్నారు. జగన్, షర్మిల వేరువేరు రాష్టాలకు, వేరు వేరు కారణాలకు ప్రతినిధులు అని… తెలంగాణలో కొత్త తరం రాజకీయానికి పునాదులు ఈనాడు పడుతున్నాయని చెప్పారు. తెలంగాణలో పుట్టిన అసలైన నాయకురాలు షర్మిలా అని… ఈ గడ్డ మీద పుట్టలేదు అనే వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టండి అని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version