అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే : సీఎం జగన్‌

-

యువ న్యాయవాదులకు తొలి మూడు సంవత్సరాలు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 2023–24 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5000 స్టైఫండ్‌ చొప్పున.. ఫిబ్రవరి 2023 – జూన్‌ 2023 (5నెలలు)కు ఒక్కొక్కరికి రూ.25,000 పంపిణీ చేశారు. ఇలా మొత్తం రూ. 6,12,65,000 ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి మరీ రిలీజ్ చేశారు.

వైఎస్సార్ లా నేస్తం పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు. ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే..జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపట్ల విశ్వాసం చూపిస్తారని.. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఆశిస్తున్నానని చెప్పారు. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని సీఎం జగన్ కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version