టీడీపీ పేరు చెప్తే వణికిపోతున్న వైకాపా లీడర్ .. !!

-

ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో వైసీపీ పార్టీ ఉన్న కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తుంది. దీంతో కర్నూలు జిల్లా వైసిపి కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి తెలుగుదేశం పార్టీ అంటేనే పేరు చెబితేనే వణుకి పోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు అని అంతేకాకుండా పన్నులు కూడా వసూలు చేయించుకుంటున్నారని జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని పనుల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా తమ హవా కొనసాగిస్తున్నారని ఇలాంటి పరిస్థితి మారాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇటీవల పేర్కొన్నాడు.

 

అంతేకాకుండా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని సంక్షేమ అమలు విషయంలో న్యాయబద్ధంగా దక్కాల్సిన సంక్షేమం లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కలుగజేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పరిస్థితి మారాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కోరుకున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version