హుజురాబాద్ లో 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు : వైఎస్ఆర్ టీపీ

-

హుజురాబాద్ ఉప ఎన్నికలో వంద నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి అన్నారు. ఆరు చోట్ల వైఎస్ షర్మిల ఇప్పటి వరకు నిరుద్యోగ దీక్షలు చేశారని తెలిపారు తూడి దేవేందర్ రెడ్డి. 7 వ నిరుద్యోగ దీక్ష మంగళవారం మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్ లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

హుజురాబాద్ లో ఉప ఎన్నిక కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని…. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మేము చేరికల కోసం పని చేయడం లేదు… క్యాడర్ ని కొత్తగా తయారు చేసే పనిలో ఉన్నామన్నారు. ఇందిరా శోభన్ ని నాయకురాలి గా తయారు చేశామని..చెప్పిన ఆయన ఆమె పార్టీ ని వీడటం తో ఎటువంటి నష్టం లేదన్నారు. అలాంటి నాయకులు వైఎస్సార్ టిపి కోకొల్లోలుగా ఉన్నారని తెలిపారు.కేసీఆర్‌ సర్కార్‌ రే తమకు టార్గెట్‌ అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version