బిడ్డ ఒక్కసారి ఓడిపోతేనే కేసీఆర్ మనసు తల్లడిల్లింది…మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి – వైఎస్ షర్మిళ

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి కేసీఆర్ పై ఫైరయ్యారు. నిరుద్యోగులపై కేసీఆర్ ను ట్విట్టర్ వేదికగా నిలదీశారు. వైఎస్ షర్మిళ ప్రతీరోజు ఏదో ఒక ప్రజా సమస్యపై ట్విట్టర్ వేదికగా అధికార పార్టీని కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. గతంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై, రైతుల సమస్యలపై కేసీఆర్ ను ప్రశ్నించారు వైఎస్ షర్మిళ.

ట్విట్టర్ లో స్పందిస్తూ ఆమె ’బిడ్డ ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది. బిడ్డకు రెండుసార్లు MLC, ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీగా ఉన్నాడు. నోటిఫికేషన్స్ లేక, ఉద్యోగాలు రాక పురుగులమందు తాగుడు, ఉరి వేసుకుంటున్నారు. ఉద్యోగం కోసం రోజుకొక్క నిరుద్యోగి చస్తుంటే మాత్రం దొరకు కనపడుతలేదు. ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదు దొరకు. నిరుద్యోగులను బలితీసుకొంటున్న హంతకుడు కేసీఆర్. ఇంకెంత మందిని బలితీసుకొంటే ఉద్యోగాలు ఇస్తారు సారూ? నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా? వాళ్ళ ప్రాణాలు నీకు లెక్కలేదా?‘ అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version