టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్

-

ఏపీలో కరోనా విజ్రుంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఏపీలో కేసులు ఎనిమిది లక్షలకి హీరువ అయ్యాయి. అయితే సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయినా ఆయనకు కరోనా సోకడం మీద వైసీపీ పార్టీలో అలానే సీఎం జగన్ కుటుంబంలో కూడా ఆందోళన నెలకొంది. ఇక ఈయన జగన్ కు సొంత బాబాయ్. జగన్ తల్లి విజయలక్ష్మి సోదరికి భర్తే, సుబ్బారెడ్డి. గతంలో ఒంగోలు ఎంపీగా కూడా ఆయన పని చేశారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా, రాష్ట్రం అంతా సమన్వయ పరిచే బాధ్యతలు అప్పగించారు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version