సముద్రంలో కుప్పకూలిన విమానం..

-

ఇండోనేషియాలో ఓ విమానం సముద్రంలో కూలిపోయింది. లయన్ ఎయిర్ సంస్థకు విమానం సముద్రంలో కుప్పకూలింది. జేటీ 610 విమానం జకర్తా నుంచి పంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలను కోల్పోయింది. దీంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించింది. అనంతరం అది సముద్రంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సముద్రంలో రెస్క్యూ టీం విమాన శకలాలను గుర్తించారు. విమానంలో మొత్తం 188 మంది ఉన్నారు. ఇద్దరు పైలట్లు, ఐదుగురు ఫ్లయిట్ అటెండెంట్లు, ముగ్గురు చిన్నారులు, 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.


Read more RELATED
Recommended to you

Latest news