చంద్ర‌యాన్‌-3కి ఇస్రో ఏం చేస్తుందో తెలుసా..?

-

భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3కి ఇస్రో చ‌కచ‌కా అడుగులు వేస్తోంది. గతంలో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో చంద్ర‌యాన్‌-2 విఫ‌లం చెందిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్పుడు ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు ఇస్రో కసరత్తు ప్రారంభించింది. ఇందుకు బెంగళూరు సమీపంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే బిలాలను కృత్రిమంగా సృష్టించి, ల్యాండర్‌ను పరీక్షించనుంది. ఇందు కోసం బెంగళూరుకు 215 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లాకేరేలోని ఉల్లార్తిలో కృత్రిమ బిలాలను సృష్టించనుంది. సుమారు పదిమీటర్ల వ్యాసార్థం, మూడు మీటర్ల లోతుతో తవ్వకాలు చేపట్టనున్నారు.

ఇందుకుసంబంధించి సెప్టెంబర్‌ మొదటి వారంలో పనులు పూర్తి కానున్నాయి. చంద్రయాన్‌-2 మిషన్‌లో ఆర్బిటార్‌ విజయవంతంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుండగా సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్‌ ప్రదేశం ఎత్తుపల్లాలతో పాటు వేగాన్ని సెన్సార్లే సమన్వయం చేస్తాయి. దీంతో దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టి సెన్సార్లు అమర్చిన ప్రత్యేక విమానాన్ని ఇస్రో ఉపయోగించి పనితీరును అంచనా వేయనుంది. ఏడు కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియను సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు సెన్సార్లు చేసే మార్గనిర్దేశాన్ని పరిశీలించనున్నారు.

నిజానికి.. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ముందు కూడా బహిరంగ ప్రదేశంలో ఉన్న స‌హ‌జ బిలాల‌పై జరిగాయి. అందుకే ఈ సారి కృత్రిమ బిలాలను సృష్టించి ల్యాండర్‌ను పరీక్షించనున్నట్లు ఇస్రోవ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందుకు బెంగళూరులోని ఇస్రో శాటిలైట్‌ ఇంటిగ్రేషనల్‌ టెస్ట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఐ సైట్‌లో పూర్తిలో ల్యాండర్‌పై పరిశోధనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news