ఇప్పుడు ట్రైన్ లో కూడా మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసేయొచ్చు.. ఎలా అంటే.?

-

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ట్రైన్లలో ఇక్యాటింగ్ సర్వీసులకు అంగీకారం తెలిపింది. దీనితో మీరు ఇప్పుడు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వొచ్చు. జర్నీ చేసేటప్పుడు కూడా మీకు నచ్చిన ఫుడ్ ని తినొచ్చచు. సాధ్యత, సిబ్బంది లభ్యత, స్థానిక పరిమితుల పై ఆధారపడి సేవలను మళ్లీ ప్రారంభింస్తామని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. దీనితో ప్రయాణికులకు కూడా ఊరట లభించింది. రెల్‌రెస్ట్రో సీఈవో, ఫౌండర్ మనీశ్ చంద్ర రైల్వే శాఖ, ఐఆర్‌సీటీసీ అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో ఇక్యాటరింగ్‌కు సంబంధించిన ప్రకటన వెలువడగం గమనార్హం.

ఇది ఇలా ఉండగా తొలిగా ఫుడ్ డెలివరీ సేవలను ఎంపిక చేసిన స్టేషన్ల లో అందుబాటు లోకి తీసుకు వస్తామని కూడా తెలిపింది. ఇది ఇలా ఉంటె ఐఆర్‌సీటీసీకి చెందిన అధికారిక ఇక్యాటరింగ్ విభాగమైన రైల్ ‌రెస్ట్రో‌కు రైల్వే శాఖ నుంచి ఇకేటరింగ్‌కు సంబంధించి అనుమతులు వచ్చాయని అన్నారు. ఇక ఈ సేవలు అందుబాటులో ఎప్పటి నుండి ఉంటాయి అనే విషయానికి వస్తే… జనవరి చివరి వారం నుంచి ఇవి రావొచ్చు అని తెలుస్తోంది. పబ్లిక్ రిలేషన్ మేనేజర్ క్రితి రాజ్ రెస్టారెంట్ పార్ట్‌నర్స్ అందరికీ శుభ్రమైన కాంటాక్ట్‌లెస్ డెలివరీ చేయాలని కోరారు.

మీరు కనుక ఫుడ్ ని ఆర్డర్ చెయ్యాలనుంటే.. ailRRestro యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ చేయొచ్చు. అలానే మీ పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ పేరు, సీటు వివరాలు వంటివి కూడా ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఇలా చేసి ఫుడ్ ని ఎంతో సులువుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ఐఆర్‌సీటీసీ గతం లోనే ఈ ఇక్యాటరింగ్ సర్వీసులు అందుబాటు లోకి తెచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news