SBI పండుగ కానుక.. 6 నెలలు వరుకు ఈఎంఐ కట్టే పనిలేదు..!

-

లోన్ తీసుకోవాలనే ఆలోచన ఉన్నవారికి ఎస్‌బీఐ పండుగ కానుక అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లుకి అదిరిపోయే ఆఫర్ ప్రవేశ పెట్టింది. ప్రి అప్రూవ్డ్ రుణ సౌకర్యం అందిస్తుంది. రూ.5 లక్షల వరకు రుణం పొందడమే కాకుండా 6 నెలలు వరుకు ఈఎంఐ చెల్లించాల్సిన పని లేదు. ప్రముఖ అతి పెద్ద దేశి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తూ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు అనేక సేవలు పొందొచ్చు కస్టమర్స్ . రుణాలు కూడా ఇందులో ఒక భాగం అనే చెప్పుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు ఎన్నో రకాల రుణాలు అందిస్తోంది. వీటిల్లో ఎమర్జెన్సీ పర్సనల్ లోన్స్ కూడా ముఖ్య భాగంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం అతి తక్కువ వడ్డీ రేటుకే రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తోంది ఎస్‌బీఐ. ఇదే కాకుండా ఈ రుణాలను యోనో యాప్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే చాలా సులభంగా పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలపై వడ్డీ రేటును కూడా తక్కువగానే వసూలు చేస్తోంది. ప్రస్తుత వడ్డీ రేటు 10.5 శాతం ఉంది. ఇతర పర్సనల్ లోన్స్‌ తో పోలిస్తే ఈ వడ్డీ రేటు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. సాధారణ కస్టమర్లు రూ.2 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అదే పెన్షన్ తీసుకునే వారు రూ.2.5 లక్షల వరకు, సర్వీస్ క్లాస్ రూ.5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.

ఇంత తక్కువ వడ్డీకే రుణం పొందడమే కాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది. కస్టమర్లకు మరో అదిరిపోయే బెనిఫిట్ లభిస్తోంది. అదేమిటంటే తొలి ఆరు నెలల వరకు ఎలాంటి మొత్తం అంటే ఈఎంఐ కట్టక్కర్లేదు. అయితే ఈ రుణాలు అందరికి అందుబాటులో లేవు. యోనో యాప్ ‌లో అర్హత కలిగిన కస్టమర్లకు మాత్రమే ఈ లోన్ ఆఫర్ అదే ప్రి అప్రూవ్డ్ లోన్స్ సెక్షన్ ‌లో కనిపిస్తుంది. లేదా మీ మొబైల్ నెంబర్ నుండి పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా మీరు అర్హత పొందుతారో లేదో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news