అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.50 పొదుపు చేస్తే చేతికి రూ.30లక్షలు..!

-

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంత డబ్బుని ఆదా చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు నుంచి పొదుపు చేయడం చాలా అవసరం. పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీము లో డబ్బులు పెట్టడం వలన ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు రోజుకి 50 రూపాయలు పెట్టుబడి పెడితే మెచూరిటీపై మీకు 35 లక్షల వరకు వస్తాయి.

భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఈ అద్భుతమైన స్కీము లో డబ్బులు పెడితే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది. భవిష్యత్తుని సురక్షితం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం దీనిని తీసుకొచ్చారు. ఈ పథకం పేరు పోస్ట్ ఆఫీస్ విలేజ్ సెక్యూరిటీ స్కీం.. దీనిని భారత పోస్టల్ శాఖ ద్వారా ప్రారంభించారు. గ్రామీణ ప్రజలను లక్ష్యంగా పెట్టుకొని దీనిని తీసుకొచ్చారు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ విలేజ్ సెక్యూరిటీ స్కీమ్ ని తీసుకొచ్చింది.

19 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు ఈ పథకంలో రోజుకి 50 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి వస్తుంది. ప్రతీ నెలా 1500 పెట్టుబడి పెట్టాలి. గ్రామ సురక్షిణ యోజనలో నిర్దిష్ట సమయం తర్వాత 35 లక్షల రాబడి వస్తుంది. బీమా చేసిన వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత బోనస్ తో పాటుగా 35 లక్షల రూపాయలని అందుకోవచ్చు. 10000 నుంచి 10 లక్షలు వరకు ఇందులో ఎంతైనా పెట్టొచ్చు. ఈ పథకంలో మీరు అధిక రాబడి ప్రయోజనాన్ని పొందుతారు. సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మీరు ఈ స్కీముని ఓపెన్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version