హైదరాబాద్ టు తిరుమల టూర్.. ఈ ప్రదేశాలు కవర్ చేసేయచ్చు..!

-

తిరుమల వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టయితే.. IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీని చూడండి. “గోవిందం” పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి తిరుపతి స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. గోవిందం పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ని అందిస్తోంది.

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. తిరుపతి, తిరుమలలోని బాలాజీ ప్రధాన ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయాలు ని ఈ ప్యాకేజీ ద్వారా చూడవచ్చు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ తర్వాత మరో స్టాప్​గా నల్గొండ రైల్వేస్టేషన్ ఒకటే ఉంటుంది.​ ఈ మూడు స్టేషన్​లలో ప్రయాణికులు ఎక్కచ్చు.

మొదటిరోజు హైదరాబాద్​లోని లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. తిరుపతి లో హోటల్ కి వెళ్ళాక. ఉదయం 8 గంటల సమయంలో తిరుమల శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనానికి తీసుకెళ్తారు. ఆ తరవాత లంచ్ చేస్తారు. తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కి తీసికెళ్తారు. సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు తిరుపతి రైల్వేస్టేషన్ నుండి ట్రైన్. మూడోరోజు మీ స్టేషన్ కి మీరు చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news