గల్లీ క్రికెట్ గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్టు టిడిపి ఫీలవుతుంది : మంత్రి గుడివాడ

-

ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి నిన్న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికల్లో కొన్ని సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటే.. మరికొన్ని సీట్లను టీడీపీ దక్కించుకుంది. అయితే ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ అసక్తికర కామెంట్స్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు చూసి గల్లీ క్రికెట్ గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్టు టిడిపి ఫీలవుతుంది అన్నారు. అసలు పంచాయతీ ఎన్నికలు స్థానిక అంశాలతో కూడినది అని.. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైయస్సార్ సీపీ గెలిచిన విషయం మరచి ఆ మీడియా ప్రచారం చేస్తుందన్నారు.

అప్పుడప్పుడు గెలిచే వారి ఆనందం టిడిపిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. పవన్ టిడిపి కలయిక గురించి ముందే చెప్పామని..ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోట ఆ కలయిక మాట వినిపించి ఉండొచ్చు. అయితే టిడిపి వ్యవతిరేక ఓట్లు చీల్చడానికి వేరుగా పోటీ చేయడం.. టిడిపి అనుకూల ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసి పోటీ చేయడం పవన్ కళ్యాణ్ కు అలవాటు అన్నారు. ఎంతమంది కలిసి పోటీ చేసిన 2024 ఎన్నికల్లో 2019 ఫలితాలు రిపీట్ ఖాయం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news