ఈ మధ్యకాలంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చొని భూములు పంచుకుంటున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే రోజుకొకరు వచ్చి దానిపై పెట్రోల్ పోసి మరింత మంట పెంచుతున్నారు. దాంతో చిలికి చిలికి గాలివానలా మారిపోతుంది ఆ వివాదం. బాలయ్య అలా అనకుండా ఉండాల్సిందంటూ కొందరు బాలయ్యను విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు రామానాయుడు స్టూడియోస్ భూములను పంచుకోడానికే అక్కడ మీట్ అయ్యారంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దానికితోడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్ మరింత దుమారం రేపింది. ఇక ఇదే అంశం పట్ల సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ నెల 8 తర్వాత, లాక్డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత సీఎం కేసీఆర్ తో బాలకృష్ణ సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. ఎందుకు తనను దూరంగా పెట్టారనే విషయాలపై కూడా బాలయ్య ఇందులో మాట్లాడబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తుంది.
కేసీఆర్ తో బాలయ్య భేటీ..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
పోలవరాన్ని గోదావరిలో కలిపేసినందుకు సిద్ధమా జగన్..? : బాల క్రిష్ణ
జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి జగన్ నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే...
Ganesh -
పోలీసులు ఎందుకు ఇంత దిగజారి పోయారో డీజీపీ సమాధానం చెప్పాలి : వర్ల రామయ్య
ఎన్నికల కమిషన్ ని టీడీపీ నేతలు శుక్రవారం కలిశారు. ఆంధ్ర ప్రదేశ్...
Ganesh -
నిలబడదాం, బలంగా పోరాడుదాం, అవినీతి కోటలు బద్దలు కోడదాం : పవన్ కళ్యాణ్
నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఇచ్చింది నెల్లూరు, ఇక్కడ చదువుకునే నేను...
Ganesh -