కొబ్బరికాయలో పేలుడు పదార్థాలను అమర్చి ఓ గర్భిణి ఏనుగును చంపిన సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటన మర్చిపోకముందే, అలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బిలాస్ పూర్ జిల్లా జాందుత్తలో ఓ గర్భిణి ఆవుకు పేలుడు పదార్థాలు పెట్టారు. దీనిపై ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఆవుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన పొరుగింట్లో ఉంటున్న నందలాల్ అనే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించాడు. బాంబు పేలడం వల్ల ఆవు దవడ పగిలిపోయింది. ప్రస్తుతంఆ ఆవు తిండి కూడా తినలేని పరిస్థితిలో నరకాన్ని అనుభవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటన జరిగిన రోజు నుంచి నందలాల్ కనిపించడం లేదు. దీంతో, అతనిపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి.
మొన్న గర్భిణి ఏనుగు..ఇవాళ గర్భిణి ఆవు..!
-
Previous article
Read more RELATEDRecommended to you
రేవంత్రెడ్డికి గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీలపై లేదు : బండి సంజయ్ కుమార్
సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పై తరచుగా విమర్శలు చేస్తున్న సంగతి...
Ganesh -
అడ్డం వస్తే సైకిల్ తో తొక్కించుకొంటు వెళ్తా : చంద్ర బాబు
రాజంపేట ఎంపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అభ్యర్థి...
Ganesh -
IPL 2024 : సత్తా చాటిన నరైన్… భారీ స్కోర్ చేసిన కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కత్తా...
Ganesh -