“సర్కారు వారి పాట” కియారా ని పక్కకు నెట్టారా …నిజమెంత …?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయో లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టగా థమన్ ఫైనల్ అయ్యాడు. ఏడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు థమన్ ల కాంబినేషన్ రిపీటవుతుండటం ఆసక్తి నెలకొంది. గోపీ సుందర్ తీసుకోవాలని పరశురాం అనుకున్నప్పటికి ఈ మధ్య టాలీవుడ్ లో థమన్ హవా చూసి మహేష్ బాబు అతనికే ఛాన్స్ ఇచ్చాడు.

 

ఇక ఈ సినిమా లో మహేష్ బాబు ఆర్ధిక నేరస్థుడిగా నటించబోతున్నాడని తెలుస్తుంది. మహేష్ కెరీర్ లోనే ఇటువంటి పాత్ర చేయకపోవడంతో ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లోను విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు టైటిల్ తో పాటు ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి అందరిలోను ఊహించనంతగా బజ్ క్రియోటయింది. చెప్పాలంటే మహేష్ బాబు ని పరశురాం ఆర్ధిక నేరస్థుడు గా చూపిస్తాడన్న విషయం తెలియగానే సినిమాని స్కై రేంజ్ లో ఊహించుకుంటున్నారు.

 

ఇక ఈ సినిమాలో ముందు కీర్తి సురేష్ ని తీసుకోవాలని టీం భావించినప్పటికి కియారా అద్వాని అయితే మహేష్ బాబుకి పర్‌ఫెక్ట్ అని తనని ఫైనల్ అనుకున్నారు. ఇప్పటికీ చిత్ర బృందం తన వైపే మొగ్గు చూపుతోంది. కాని ప్రస్తుతం బాలీవుడ్ లో కియారా కమిటయిన సినిమా డేట్స్ తారుమారు కావడంతో సర్కారు వారి పాట కి డేట్స్ సర్ధుబాటు చేయలేకపోవచ్చన్న అభిప్రాయంతో సెకండ్ ఛాయిస్ గా సాయి మంజ్రేకర్ ని పరిశీలిస్తున్నారట. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు- నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ‘దబాంగ్-3’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ కియారా డేట్స్ కుదరకపోతే మాత్రం ఈ బ్యూటినే ఫైనల్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news