ప్రపంచంలోనే అప్ డేటెడ్ టెక్నాలజీతో.. సరికొత్త విధానంలో నిర్మిస్తున్నారు హైదరాబాద్ మెట్రోను. ఇప్పటికే రెండో మార్గాల్లో మెట్రో ప్రారంభం కూడా అయింది. నాగోల్ టు మియాపూర్ ఒక కారిడార్, ఎల్బీనగర్ టు అమీర్పేట మరో కారిడార్ ప్రారంభమయింది. ప్రయాణికులు కూడా మెట్రోను ఉపయోగించుకుంటున్నారు. రోజు రోజుకు మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. దీంతో త్వరగా అమీర్ పేట టు హైటెక్ సిటీ కారిడార్ను ప్రారంభించడానికి ఎల్అండ్టీ రెడీ అవుతోంది. అమీర్ పేట టు హైటెక్ సిటీకి 11 కిలోమీటర్లు. హైదరాబాద్ ఐటీకి ఎంత ఫేమసో తెలుసు కదా. బెంగళూరు తర్వాత ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న సిటీ హైదరాబాద్. ఎక్కువ ఐటీ కంపెనీలు కూడా హైటెక్ సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఆ రూట్కు బాగా డిమాండ్. ఇక.. డిసెంబర్ లోనే ఈ రూట్ ను ప్రారంభించడానికి ఎల్అండ్టీ రెడీ అవుతుండటంతో ఐటీ ఉద్యోగులకు ఇది వరం కానుంది. దీని తర్వాత జేబీఎస్ టు ఎంజీబీఎస్ మార్గంలో 10 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించి మెట్రో మొదటి దశను పూర్తి చేయనున్నారు. అనంతరం మెట్రో రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్, బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్, నాగోల్ టు ఎల్బీనగర్, ఎల్బీనగర్ టు ఫలక్నుమాకు మెట్రో మార్గాన్ని వేయనున్నారు.
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ఇంట్లో ఎంత వరకు నగదు ఉంచుకోవచ్చు
ఈరోజుల్లో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. చిన్న వస్తువు కొన్నా యూపీఐ ద్వారానే...
పెరిగిన EPFO వడ్డీ రేట్లు, ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయంటే
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల...
పీఎం-కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ చేస్తారు..?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 16వ విడతను ఫిబ్రవరి 28న...