రేషన్ షాప్ లో నాటు బాంబుల కలకలం …!

-

నేడు ఉదయం ఉత్తర ప్రదేశ్ లో పోలీస్ చేతులలో ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వికాస్ అనుచరుడుకి చెందిన ఒక రేషన్ షాప్ నుంచి కాన్పూర్ పోలీస్ అధికారులు 7 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అగ్నిహోత్రికి చెందిన దయ శంకర్ దూబే అనుచరుడు జయశంకర్ కు అగ్ని హోత్రికి చోబె పుర పోలీస్ స్టేషన్ పరిధిలో బీక్రు గ్రామంలో ఒక ప్రభుత్వ రేషన్ దుకాణం ఉంది.

bomb
bomb

తాజాగా అతని రేషన్ దుకాణం నుంచి పోలీసు అధికారులు 7 నాటు బాంబులను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక ఇటీవల వికాస్ ను అరెస్ట్ చెయ్యడానికి వచ్చిన పోలీసులపై అతని గ్యాంగ్ కాల్పులు నిర్వహించారు. ఈ కాల్పుల్లో దాదాపు ఎనిమిది మంది పోలీసులు మరణించారు. అనంతరం పరారీలో ఉన్న గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఒకరిని, గురువారం నాడు ఒకరిని ఎన్ కౌంటర్ చేశారు. అలాగే మరో నలుగురిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news