రాజకీయ నాయకులు చెప్తే అంత్యక్రియలు చేస్తారట…!

-

నిజంగా మన దేశంలో కరోనాతో చావడం కంటే ఇంకా ఏదైనా చేసుకుని చావడం నయం అనే విధంగా ఉంది పరిస్థితి. దేశ వ్యాప్తంగా కూడా కరోనా మరణాల విషయంలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఒక ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ లో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశాన వాటిల్లో కాల్చేందుకు నిరాకరిస్తున్నారు నిర్వహకులు.

coronavirus
coronavirus

కేవలం రాజకీయ పలుకుబడి ఉన్నవారికే అనుమతి ఇస్తున్నారు. హన్మకొండకు చెందిన వెంకటేశ్వరరావు కరోనా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. అంత్యక్రియలు చేయాలని నగరంలోని అన్ని శ్మశాన వాటికలను ఆశ్రయించారు ఆయన కుటుంబ సభ్యులు. చేసేది లేక మృతదేహాన్ని మర్చూరిలోనే ఉంచిన బాధితులు… పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే ఫలితం లేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news