బ్రేకింగ్:తల్లి బిడ్డా మృతి కేసులో ఇరుక్కున్న పోలీసులు…!

-

గుంటూరు తల్లీ బిడ్డా మరణం కేసులో ఇప్పుడు మనోజ్ఞ భర్త కళ్యాణ్ చక్రవర్తిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ఞ తల్లి తండ్రులు చేసిన ఆరోపణల ప్రకారం చూస్తే… తన కూతుర్ని, మనువరాలిని భవనంపై నుంచి తోసేసి ఆత్మహత్యలా చిత్రీకరించారు అని మనోజ్ఞ తల్లి ఆరోపించారు. ఆత్మహత్యలా చిత్రీకరించి ఇంట్లోనే దర్జాగా కూర్చున్నారు అని వారు ఆరోపణలు చేసారు.Guntur: Techie ends life with kid

అయితే ఇప్పటి వరకు పోలీసులు మనోజ్ఞ భర్త కళ్యాణ్ చక్రవర్తిని విచారణకు పిలవలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. అతనితో పాటుగా… అతని తల్లి తండ్రులను కూడా విచారించి శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. భవనంపై నుంచి అతనే కచ్చితంగా తోసేసాడు అని వారు ఆరోపించారు. అయితే కళ్యాణ్ చక్రవర్తి వాదన మరోలా ఉంది. మార్నింగ్ వాక్ కోసం అని పైకి వెళ్ళింది అని తాను శబ్దం వస్తే బయటకు వచ్చాను అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news