అదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది…?

-

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం తిర్యాణి- మంగి అటవీ ప్రాంతంలో కూంబింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. భాస్కర్ దళం కోసం ముమ్మరం గా గాలింపు చర్యలు చేపట్టారు. 3 రోజులుగా ఆసిఫాబాద్ లోనే ఉన్న డిజిపి మహేందర్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మావోయిస్టుల కదలిక లపై జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్షలు చేస్తున్నారు.

maoists
maoists

పోలీస్ బాస్ రోజుల తరబడి జిల్లాలో ఉండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు ఐజి నాగి రెడ్డి కూడా జిల్లాలోనే ఉన్నారు. వీరిద్దరి రాకతో అసలు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. అసలు వారు ఎందుకు వెళ్ళారో మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీనితో సర్వత్రా ఆందోళన నెలకొంది. మావోయిస్ట్ అగ్ర నేతలు కొందరు లొంగిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని అది నిజం కాదని మావోయిస్ట్ పార్టీ నిన్న ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news