పెట్రోల్ బంకుల్లో చిప్స్.. హైదరాబాద్ లో 13 బంకులు సీజ్ !

-

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్వోటీ పోలీసుల దాడులు జరిపారు. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్ గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్ ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు. అలా చేస్తున్న హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని 26 బంక్ లను కూడా ఏపీ పోలీసులు సీజ్ చేశారు.

చిత్తూరు జిల్లాలోని బంకు నిర్వాహకులు తమిళనాడు నుండి చిప్స్ తెప్పిస్తే హైదరాబాద్ బంకుల వాళ్ళు మహారాష్ట్ర నుండి ప్రత్యేక చిప్ లను తెప్పించినట్టు గుర్తించారు. వీరు అంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ట్లు గుర్తించారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. పెట్రోల్ బంకులలో మోసాలకు పాల్పడుతున్న 26 మందిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఈ చిప్స్ అమర్చడం ద్వారా కోట్ల రూపాయల మేర వాహనదారులను మోసం చేసినట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news