ఆల్ ది బెస్ట్ అంటున్న వెంకీమామ.. మిస్ అవుతున్నాం అంటూ సన్రైజర్స్ ట్విట్.?

-

క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్ ప్రారంభం కాగా ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో తలపడేందుకు సిద్ధమైంది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ మ్యాచ్ అంటే స్టేడియం వరకు భారీగా వెళ్లి ఎంకరేజ్ చేసే వాళ్లు ప్రేక్షకులు.. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.

ఈ క్రమంలోనే ప్రతిసారీ స్టేడియానికి వెళ్లి హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేసే సినీ నటుడు వెంకటేష్ పాత రోజులను గుర్తు చేసుకుంటూ.. మిమ్మల్ని టీవీల ముందు కూర్చుని ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తాను అంటూ ట్విట్ పెట్టగా దీనిపై సన్రైజర్స్ యాజమాన్యం స్పందిస్తూ మీరు స్టాండ్స్ లో నిలుచొని చేసే సపోర్ట్ మేము మిస్ అవుతున్నాము అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news