చెల్లి బాధ చూడలేకే హేమంత్ మర్డర్ ?

-

హేమంత్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. నెల రోజుల ముందే హేమంత్ ని చంపేందుకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ లు ప్లాన్ చేసారు. నెల రోజుల ముందే అందుకోసం రెక్కి కూడా చేశారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో హేమంత్ నివాసముంటున్న నేపధ్యంలో హేమంత్ ఎలా చంపాలి ఎలా కిడ్నాప్ చేయాలన్న దాని పై యుగంధర్ స్కెచ్ వేశారు. సుపారీకు మర్డర్ లు చేసే కృష్ణ, రాజు, పాషాలతో పలుమార్లు ఈ విషయం మీద యుగంధర్ డిస్కస్ కూడా చేశారు.

మాయమాటలు చెప్పి అవంతిని తమ వైపు తిప్పుకోవాలని లక్ష్మారెడ్డి ప్లాన్ చేశారు. నెల రోజులుగా తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసినా ఆమె లొంగలేదు. అయితే అవంతి, హేమంత్‌ వివాహంతో అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి, భార్య అర్చనలు తన కూతురు వివాహంపై యుగంధర్‌రెడ్డితో గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలల పాటు ఈ పెళ్లి కారణంగా ఇంట్లోనే ఉండిపోయారు ఉన్న లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు. దీంతో తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్‌ నుంచి విడదీయాలని నిర్ణయించుకున్న యుగంధర్‌రెడ్డి ప్లాన్ చేసి చంపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news