రాయదుర్గం పబ్‌లో కత్తితో దాడి.. ముగ్గురికి గాయాలు

-

రాయదుర్గం పబ్‌లో కత్తితో దాడి జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్ లోని రాయదుర్గం పబ్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కృతిక్(23) మరియు అదే పబ్‌లో బౌన్సర్‌గా పని చేస్తున్న ఆరిఫ్‌ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే కృతిక్‌తో పాటు అతని అన్న మల్లికార్జున్(24), స్నేహితుడు కళ్యాణ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు బౌన్సర్ ఆరిఫ్.

Youth injured in knife attack at pub in Raidurgam

దీంతో గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉండగా కళ్యాణ్‌కు చేతికి, కాలుపై గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడ్డ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news