విజయవాడ కాల్పుల కేసులో.. పోలీసులకి కీలక ఆధారాలు !

-

ప్రశాంతంగా ఉన్న విజయవాడలో నిన్న అర్థరాత్రి కాల్పుల కలకలం చెలరేగిందన్న సంగతి తెలిసిందే. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ లో పని చేస్తున్న మహేష్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిన్న అర్థరాత్రి ఈ ఘటన జరిగింది..నిందితుడు మహేష్ గత కొన్ని రోజులుగా భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ కాల్పుల ఘటనలో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను గుర్తించారు.

ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారనే దాని మీద పోలీస్ ఉన్నతాధికారులు ఒక నిర్ధారణ కొచ్చినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు వాడింది 6MM బులెట్లు ఉపయోగించారని గుర్తించారు పోలీసులు. 2014 తర్వాత తుపాకీతో కాల్చి చంపిన ఘటన కావడం అదీ కాక అతని డిపార్ట్మెంట్ కి సంబందించిన వ్యక్తి కావటంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తుపాకీ ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎవరు ద్వారా తెచ్చారు..? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యవహరమా..? అక్రమ సంబంధమా..? మరేయితర కారణాలు అయినా ఉన్నాయా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news