ఏపీ డిజిపికి అజయ్ కల్లం ఫిర్యాదు

-

కల్లం అజేయ రెడ్డి అలియాస్ అజయ్ కల్లాం ఈయన మాజీ ఐఏఎస్. జగన్ సిఎం అయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు నియమితులు అయ్యారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరిట మోసాలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు ఆయన.

విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని మంగళగిరిలో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలానే సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కొద్ది రోజుల కిందట కూడా కీలక బాధ్యతలలో ఉన్న పీవీ రమేష్‌కు కూడా ఇలాంటి చిక్కులు వచ్చాయి. అయితే ఆయన పేరును వాడుకుని నూతన్ నాయుడే కొన్ని చిల్లర పనులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news