మ‌హేష్ హీరోయిన్ విఫ‌ల ప్రేమాయ‌ణం!

-

స్కూల్ డేస్ ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో మ‌ర్చిపోలేని మ‌ధుర జ్ఞాప‌కాల్ని అందిస్తుంది. అవి జీవితాంతం తీపి గుర్తులుగా మిగిలితే కొన్ని జీవితాంతం మ‌న‌ల్ని వెంటాడుతూ వుంటాయి. అలాంటి జ్ఞాప‌కాలే మ‌హేష్ హీరోయిన్ కియారా అద్వానీని వెంటాడుతున్నాయ‌ట‌. హైస్కూల్ డేస్‌ని గుర్తు చేసుకుంటూ ప‌ర‌వ‌శించిపోతోంది. స్కూల్ డేస్‌లోనే త‌ను ప్రేమ‌లో ప‌డిందంట‌.

అయితే అది ఊరించి ఉడికించి విఫ‌ల‌మైంద‌ట‌. ఇదే విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టింది కియారా. ఆ ప్రేమ త‌న‌ని ఇంత కాలం వెంటాడుతోంద‌ని చెబుతోంది. ప్ల‌స్ టు చ‌దివే రోజుల్లో త‌ను ఓ అబ్బాయితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ్డాన‌ని, హ‌లీడేస్‌లో ఏదో కార‌ణాలు చెప్పి బ‌య‌టికి వెళ్లి మ‌రీ అత‌న్ని చూసేదాన్ని అంటోంది. దీంతో చ‌దువులో డ‌ల్‌గా వుండ‌టంతో ఇంట్లో వాళ్లు కియారాని మంద‌లించే వాళ్ల‌ట. దీంతో ఇంట్లో వారి పోరు ప‌డ‌లేక త‌న ప్రేమ‌ని త్యాగం చేసేసింద‌ట‌.

ప్రేమ‌ని త్యాగం చేసిన త‌రువాత చాలా మ‌నోవేద‌నకు గురైంద‌ట‌. అయితే ఆ త‌రువాత తాను తేరుకున్నాన‌ని చెప్పుకొచ్చింది. `ల‌స్ట్ స్టోరీస్‌`తో సంచ‌ల‌నం సృష్టించిన కియారా ఆ త‌రువాత మ‌హేష న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం హిందీతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news