స్వల్పంగా పెరిగిన బంగారం, భారీగా పెరిగిన వెండి ధరలు

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం నిన్నటి ధర కంటే అత్యల్పంగా పెరిగాయి. ఇక హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర నిన్నటి మీద కేవలం పది గ్రాములకి పది రూపాయలు మాత్రమే పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹52,370కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹48,010కి పెరిగింది.

అయితే ఢిల్లీ మార్కెట్‌ లో మాత్రం ఈ రేట్ కాస్త భారీగానే పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.430 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.55,030కిచేరింది. ఇక అక్కడ కూడా గ్రాముకి 43 రూపాయల చొప్పున రేటు పెరిగింది. ఇక నిన్న బాగా తగ్గిన వెండి ధరలు ఈ రోజు మాత్రం బాగా పెరిగాయి. తాజాగా మార్కెట్‌లో వెండి ధర 900 రూపాయలు పెరిగింది. దీంతో 65వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పరుగులు తీశాయి. దీంతో కేజీ వెండి ధర 65,400 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news