చనిపోయాడనుకున్న వ్యక్తి మూడేళ్ళ తర్వాత వేరే దేశం జైల్లో బ్రతికి ఉన్నాడు…!

-

మూడేళ్ల క్రితం మరణించినట్లు భావించిన బీహార్ కి చెందిన ఒక 60 ఏళ్ళ వృద్దుడు బంగ్లాదేశ్ జైల్లో బ్రతికి ఉన్నాడు అనే సమాచారం అందింది. బీహార్‌ లోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి బంగ్లాదేశ్‌ లోని జైలులో బ్రతికి ఉన్నాడు. మంగళవారం సాయంత్రం బెట్టియాలోని రెడ్‌ క్రాస్ సొసైటీకి చెందిన ఒక శాఖ బంగ్లాదేశ్‌ లోని చంపై నవాబ్‌గంజ్ జైలులో ఖైదీగా ఉన్న రామ్‌దేవ్ మహాటో కుటుంబ సభ్యులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది.

Man in prison hands of behind hold Steel cage jail bars. offender criminal locked in jail.

బంగ్లాదేశ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా అతను ఒక మెసేజ్ పంపించాడు. “మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేను బంగ్లాదేశ్ జైలులో ఉన్నాను. ఇక్కడి నుంచి నన్ను విడుదల చేయడానికి కొన్ని పత్రాలు అవసరం ”అని 2020 అక్టోబర్ 28న అతను ఒక లేఖ పంపాడు. జులై 30, 2017న శ్రావణ మాసంలో… ఒక కార్యక్రమం కోసం వెళ్లి ఆ తర్వాత కనపడకుండా పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news