బ్రేకింగ్ : రిపబ్లిక్ ఛానల్ సీఈఓ అరెస్ట్

-

టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టిఆర్పి) కుంభకోణం కేసు దర్యాప్తుకు సంబంధించి, ముంబై పోలీసులు ఆదివారం రిపబ్లిక్ టివి సిఇఒ వికాస్ ఖంచందానిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్‌ కు చెందిన క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ (సిఐయు) 13 మందిని అరెస్టు చేశారు.

ఎంపిక చేసిన గృహాలను మేనేజ్ చేయడం ద్వారా టిఆర్‌పిలు లేదా టెలివిజన్ రేటింగ్ పాయింట్లను మోసం చేస్తున్నారు అంటూ అంచనా వేసే రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్), హన్సా రీసెర్చ్ గ్రూప్ ద్వారా ఫిర్యాదు చేసింది. కొన్ని టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పి నంబర్లను రిగ్గింగ్ చేస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  అక్టోబర్ 6 న, హన్సా రీసెర్చ్ అధికారి నితిన్ డియోకర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ముంబై పోలీసులు మొదట ఛార్జ్ షీట్  దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news